మానిఫెస్టోకు రిలీజ్ కు ముందే వైసీపీ అధినేత వైయస్ జగన్ గుంటూరులో జరిగిన బహిరంగ సభలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ కానుక ప్రకటించారు. పేదవారు మొదలుకొని ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికి కొత్తగా యూనివర్సల్ హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు.
అంటే నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తామని ఆయన అన్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు వాళ్లందరిని యూనివర్సల్ హల్త్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తానే ఈ పథకాన్ని పర్యవేక్షిస్తానని వెల్లడించారు.