ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైయస్ జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రీపోలింగ్ అప్రజాస్వామికమా..? లేక రిగ్గింగ్ అప్రజాస్వామికమా..? అని ప్రశ్నించారు. చంద్రగిరిలో దళితులు ఓటు వేయకుండా అడ్డుకుని వారి ఓట్లు మీరు వేయడం అప్రజాస్వామికమా..? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడడమా..? ఏ తప్పు చేయనప్పుడు రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు చంద్రగిరిలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రజాస్వామికంగా జరిపించాలని ఆయన ఈసీని కోరారు. కాగా ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. 321-ఎన్ఆర్ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ను నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.