పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష
పోలవరం ప్రాజెక్టుపై తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టుపై తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రివర్స్ టెండరింగ్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కీలక చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి , జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ , అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరాం పాల్గొన్నారు.