సీఎం జగన్ మే 'డే' శుభాకాంక్షలు
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికులకు గురువారం ట్విటర్ ద్వారా మే 'డే' శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికులకు గురువారం ట్విటర్ ద్వారా మే 'డే' శుభాకాంక్షలు తెలిపారు.అందులో.. 'కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. ప్రపంచ ప్రగతి, ఆర్ధిక వ్యవస్థ పురోగతి కార్మికుల స్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలను ధారపోయడం వల్లే సాధ్యమవుతోంది. రేపు కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు.' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు సీఎం.