సీనియర్ నేతలతో వైయస్ జగన్ భేటీ

Update: 2019-04-02 04:07 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ లోటస్ పాండ్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ మానిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. వీలైనంత త్వరగా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రజలకు ప్రచార సమయంలో మేనిఫెస్టో పత్రాల తోపాటుగా ప్లాస్టిక్ తో తయారు చేసిన ఫ్యాన్ గుర్తు బొమ్మలను అందించాలని ఆ పార్టీ నేతలు జగన్ కు సూచిస్తున్నారు.

మరోవైపు టిక్కెట్ రాని అసంతృప్తి నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నట్టు సమాచారం.జగన్ తో భేటీ అయ్యేందుకు కొందరు నేతలకు అపాయింట్ మెంట్ దొరికినట్టు తెలుస్తోంది. కాగా ఈ 9 రోజులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కు సూచిస్తున్నారు జగన్. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఏజంట్లు పోలింగ్ బూతుల్లోనే ఉండేట్టుగా చూడాలని నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. 

Similar News