ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు అండగా నిలబడుతున్నారు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు వైఎస్ జగన్ను.. ఈ సందర్బంగా ప్రచార సభకు ముందు కడప విమానాశ్రయంలో అనిల్ అనే అభిమాని జగన్ ను కలిశారు. పార్టీ ఎన్నికల ఖర్చు కోసం 5 లక్షల రూపాయల చెక్కును అందించారు అనిల్.. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్బంగా జగన్ ను కోరారు అనిల్.అలాగే ఈసారి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.