అమరావతిలో ఉధృతమవుతున్న ఆందోళనలు.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువకులు

Update: 2020-01-18 10:47 GMT
అమరావతిలో ఉధృతమవుతున్న ఆందోళనలు.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువకులు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరులో నలుగురు యువకులు సెల్‌ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సెల్‌ టవర్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని రైతుల ఆందోళనలు 32 వ రోజుకు చేరాయి. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుళ్లూరు, మందడం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Tags:    

Similar News