లోకేశ్ అలా అయ్యాక ఇంత పెద్ద వరదను చూసి ఉండడు : ఎంపీ విజయసాయిరెడ్డి

Update: 2019-08-17 06:26 GMT

మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.. అందులో 'పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా. చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్‌ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది.', అలాగే 'లోకేశ్ 'పెద్ద మనిషయ్యాక' ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది.' అని పేర్కొన్నారు. అలాగే 'మాజీలైన మంత్రులు కొందరు బాబు అక్రమ కొంపకు వాచ్‌మన్లలాగా కాపలా కాయడం ఏమిటి? కర్మ కాకపోతే. ముంపు ప్రాంతాలను డ్రోన్లతో ఎలా చిత్రీకరిస్తారని మీడియాను దబాయిస్తున్నారు. లింగమనేని ఇంటి గురించి ఆందోళన మానేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయపడండి బాబూ.' అంటూ మాజీ మంత్రులనుద్దేశించి ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News