రాజధాని మార్పు వార్తలపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

Update: 2019-08-23 07:19 GMT

అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం మార్చబోతోందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీపీలోని కొందరు నేతలు కోరుతున్నారు. వారిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. 'అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, "కావాల్సిన" వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు.' అంటూ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News