Vijayasai Reddy: పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలి

Vijayasai Reddy: కేంద్రం చొరవ తీసుకొని సబ్సిడీ పెంచాలి

Update: 2022-03-29 11:15 GMT

Vijayasai Reddy: పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలి

Vijayasai Reddy: నానాటికీ పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతులు అల్లాడుతున్నారని, వెంటనే కేంద్రం ఆ సమస్యను అరికట్టాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏడాదిలో ఎరువుల ధరలు సగటున 45 నుంచి 60 శాతం పెరిగాయన్నారు. మరోవైపు బడ్జెట్‌లో ఎరువులపై సబ్సిడీని లక్షా 40 వేల కోట్ల నుంచి లక్షా 5 వేల కోట్లకు అంటే 30 శాతం తగ్గించారన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఎరువుల ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పెంచాలన్నారు.

Tags:    

Similar News