ఆ వాయిస్ నాది కాదు : ఎంపీ విజయసాయిరెడ్డి వివరణ

Update: 2019-04-06 13:02 GMT

ప్రధాని మోడీ, ఏపీ ప్రజలనుద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుట్ర పూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఓ ఆడియో టేప్ చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై  వివరణ ఇస్తూ తీవ్రంగా ఖండించారు ఎంపీ విజయసాయిరెడ్డి. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో నాపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. నేను ఎవరితోనూ అంత దరిద్రంగా మాట్లాడలేదు. పైగా కొన్ని కొన్ని పదాలు నాకు అసలు తెలియవు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వేళా మా పార్టీ నేతలను టీడీపీవారు టార్గెట్ చేస్తున్నారు.

మొన్న లక్ష్మీపార్వతి గారిని టార్గెట్ చేశారు. ఇవాళ నన్ను టార్గెట్ చేసి ఎన్నికల సమయంలో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. నా వాయిస్ ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. పల్లెటూళ్లలో వుండే కొందరికి నా వాయిస్ తెలియదులే అనుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అలాగే ఆ వాయిస్ నాది కాదని నేను ప్రూవ్ చేస్తాను.. నాది అని మీరు ప్రూవ్ చెయ్యగలరా అని సవాల్ విసిరారు.

Similar News