నిమ్మగడ్డను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలి: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

*ఎస్ఈసీ నిమ్మగడ్డపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్ *నిమ్మగడ్డను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ కామెంట్ *వ్యక్తి స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను హరించేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు

Update: 2021-02-06 10:44 GMT

ఏపీ పంచాయితీ పోరు మరింత పీక్స్‌కు చేరుకుంది. నిమ్మగడ్డ, వైసీపీ నేతల హాట్ కామెంట్లతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిమ్మగడ్డను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేయాలన్న నిమ్మగడ్డ ఆదేశాలపై ఎమ్మెల్యే మండిపడ్డారు. వ్యక్తి స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను హరించేలా నిమ్మగడ్డ చర్యలు ఉన్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News