టపాసుల విక్రేతలపై వైసీపీ నేతల అక్రమ దందా, ఒక్కో దుకాణం నుంచి రూ.30 వేల వసూలు

YCP Leaders: వ్యాపారం లేని తమను డబ్బులు అడగటంపై దుకాణం దారుల మండిపాటు...

Update: 2021-11-05 05:48 GMT

టపాసుల విక్రేతలపై వైసీపీ నేతల అక్రమ దందా, ఒక్కో దుకాణం నుంచి రూ.30 వేల వసూలు

YCP Leaders: అనంతపురంలో టపాసుల విక్రేతలపై వైసీపీ నేతల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఒక్కో దుకాణం నుంచి 30 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ డబ్బు వసూలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వైసీపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారు. అసలే వర్షాలతో టపాసుల అమ్మకాలు లేవని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారం లేని తమను డబ్బులు అడగటంపై దుకాణం దారుల మండిపడుతున్నారు.

Tags:    

Similar News