Rama Krishnudu: మేం ఇళ్లు కట్టిస్తే.. వైకాపా రంగులు వేసుకుంది

Rama Krishnudu: పూర్తికాని ఇళ్లకు ప్రారంభోత్సవం చేశారన్న యనమల

Update: 2023-10-12 07:17 GMT

Rama Krishnudu: మేం ఇళ్లు కట్టిస్తే.. వైకాపా రంగులు వేసుకుంది

Rama Krishnudu: గడచిన నాలుగేళ్లలో సీఎం జగన్ విహార యాత్రలు చేశారు తప్ప, అభివృద్ది చేయలేదని టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. పేదవాడి పేరు చెప్పి వైసీపీ నేతలు రాష్ట్రంలో వనరులన్నీ దోచుకున్నారు తప్ప అభివృద్ది చేయలేదన్నారు. ఈవిషయాన్ని అనేక సార్లు రుజువు చేశామన్నారు. పూర్తికాని ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం రంగులు మాత్రమే వేసిందన్నారు.

Tags:    

Similar News