పాముకాటుకు గురై మహిళ మృతి.. భయాందోళనలో అక్కడి ప్రజలు..

Update: 2019-08-24 04:55 GMT

ఇటీవల కురిసిన వర్షాలతో పాములు జనావాసాల్లోకి వచ్చేశాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా పాముల బెడద ఎక్కువైంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అక్కడ 8 నెలల కాలంలో ఇప్పటికే 10 మంది పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోగా.. తాజాగా నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామానికి చెందిన పీతా వెంకటేశ్వరమ్మ (45)ను పాము కరిచింది. దాంతో ఆమె మరణించారు. కూలీ పనికి వెళ్లే వెంటేశ్వరమ్మ ఎప్పటిలాగానే శుక్రవారం పనికి వెళ్లారు. అయితే పొలంలో పనిచేస్తుండగా ఆమెను ఓ విషపూర్తిత పాము కాటేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యం చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇప్పటికే పదిమంది దాకా పాముకాటుతో మృతిచెందారు. తాజాగా ఈ ఘటనతో అక్కడి ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News