మహిళా సమస్యల పరిష్కారానికి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి త్వరలోనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామంటున్నారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డిపద్మ.. సోషల్ మీడియాలో మహిళల భద్రతపై కళాశాలల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామనీ వేధింపులు ఎదుర్కొనడానికి, కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామనీ అన్నారు.