తల్లి కోసం బిడ్డలు, బిడ్డల కోసం తల్లి అల్లాడుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో తల్లి బిడ్డల సంబంధం తెగిపోయింది. విశాఖకు చెందిన సిందూష తన ఇద్దరు చిన్నారులను వదిలి విసా రెన్యూవల్ కోసం మలేషియా వెళ్లింది. తిరిగి వచ్చే సమయంలో కౌలాలంపూర్లో ఫ్లైట్స్ రద్దు చేయడంతో ఆందోళనకు గురవుతోంది. తన బిడ్డలు తన కోసం అల్లాడుతున్నారంటూ ఆమె వాపోయింది. తన ఆవేదనను వాట్సాప్ ద్వారా తన తల్లిదండ్రులకు పంపింది. తమ కూతురిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలంటూ సిందూష తల్లి వేడుకుంటోంది.