Vijayawada: చెడ్డీ గ్యాంగ్ కేసును చేధించిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో...

Vijayawada: రెండు ముఠాలుగా దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు...

Update: 2021-12-17 10:09 GMT

Vijayawada: చెడ్డీ గ్యాంగ్ కేసును చేధించిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో... 

Vijayawada: విజయవాడలో కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ కేసును పోలీసులు చేధించారు. ముగ్గురు నిందితులతో దోపిడీలకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక.. చెడ్డీ గ్యాంగ్ ను గుజరాత్ నుంచి విజయవాడరు తీసుకొచ్చారు. నిందితులను గుజరాత్ లోని దాహాద్ జిల్లా గుల్బర్గాకు చెందిన వారిగా గుర్తించారు.

మొత్తం రెండు ముఠాలుగా ఏర్పడి దోపిడీలు చేశారన్న పోలీసులు.. పోరంకి, తాడేపల్లిలో దోపిడీలకు పాల్పడింది ఒకే ముఠాగా గుర్తించారు. అటు.. చిట్టినగర్, గుంటుమిల్లిలో దోపిడీలకు పాల్పడింది మరో ముఠాగా పోలీసులు తేల్చారు.

Tags:    

Similar News