8న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక

Update: 2020-02-05 03:27 GMT

విశాఖపట్నం: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ నెల 8 న విశాఖ రానున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనంతరం నగరంలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారు. 10 న తిరుగు ప్రయాణం కానున్నారు. పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News