ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విషాదం నెలకొంది. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి మహాలక్ష్మమ్మ (73) మృతి చెందారు. ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహాలక్ష్మమ్మ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మహాలక్ష్మమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. మరోవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్థసారధి, మేరుగ నాగార్జున తదితరులు మంత్రి వెల్లంపల్లిని పరామర్శించి, సానుభూతి తెలిపారు.