దేవినేనికి సవాల్ విసిరిన వసంత..

Update: 2019-08-16 14:52 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సవాల్ విసిరారు.. రాజధాని విషయంలో దేవినేని ఉమ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. అమరావతి ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది.. ఒకవేళ రాజధాని అమరావతిలో లేనిపక్షంలో నా పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే నువ్వు శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతావా?. అని దేవినేనికి సవాల్ విసిరారు కృష్ణప్రసాద్. అలాగే వరద విషయంలో ఉమామహేశ్వరరావు విచిత్రంగా మాట్లాడుతున్నారన్నారు. ఎవరికైనా వరదలను కంట్రోల్ చేసే శక్తీ ఉంటుందా..? డ్రోన్ కెమెరాలతో వరద ఉధృతిని అంచనాలు వేస్తుంటే తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. 

Tags:    

Similar News