Vasantha Krishna Prasad: టీడీపీ గూటికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..?
Vasantha Krishna Prasad: రెండ్రోజుల్లో టీడీపీలో చేరనున్న వసంత కృష్ణ ప్రసాద్
Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధమైయ్యారు. మరో రెండ్రోజుల్లో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మైలవరం టికెట్ తనకు ఇవ్వాలని వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబును కోరుతున్నారు. మైలవరంతో పాటు పెనమలూరును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్తో పాటు,దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావులు కూడా మైలవరం టికెట్ రేసులో ఉన్నారు. ఎల్లుండి అన్నారావుపేట నుంచి ప్రచారానికి దేవినేని ఉమా ఏర్పాట్లు చేసుకోగా.. అభ్యర్థిగా క్లారిటీ రాకపోవడంతో మైలవరం టీడీపీ కేడర్లో గందరగోళం నెలకొంది.