Kishan Reddy: త్వరలో చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌

* కృష్ణాజిల్లాలో కొనసాగుతున్న రెండో రోజు జన ఆశీర్వాద యాత్ర

Update: 2021-08-20 04:52 GMT

కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

Kishan Reddy: త్వరలో చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. కృష్ణాజిల్లాలో రెండో రోజు జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన 100 మంది జర్నలిస్ట్‌లకు కేంద్రం 5లక్షల నగదును అందించిందని తెలిపారు. కరోనాతో పేరెంట్స్ కోల్పోయిన చిన్నారుల చదువు బాధ్యతను కేంద్రం తీసుకుంటుందన్నారు. కరోనా వారియర్స్‌కు కిషన్‌ రెడ్డి పాదాభివందనాలు తెలిపారు.

Tags:    

Similar News