వేసిన ఓటు ఎవరికీ పడిందో తెలియదు కానీ 130 సీట్లా..?

Update: 2019-05-07 13:28 GMT

సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. వివిఫ్యాట్, ఈవీఎంలపై సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడుతూ.. వివి ఫ్యాట్ ల విషయంలో అనుమానాలు ఏంటని.. ఓటు ఎవరికీ వేశామన్నది స్పష్టంగా తెలిసినప్పుడు.. నా ఓటు ఎవరికీ పడిందో అని ఒక సీఎం అనవచ్చా.. వేసిన ఓటు ఎవరికీ పడిందో తెలియదు కానీ 130 సీట్లు మాత్రం వస్తాయా అని ప్రశ్నించారు. వివిఫ్యాట్ లలో ఐదు స్లిప్ లు లెక్కబెడతారు. అందులో తేడా వస్తే మొత్తం లెక్కబెడతారని గుర్తుచేశారు. సీఎంగారు ఈ ఎలెక్షన్లలో ఎందుకింత అసహనానికి గురవుతున్నారని అన్నారు. ఎలక్షన్ తో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ అనేది ఉంటుంది., అలాంటప్పుడు ఎందుకింత బాధ అని చంద్రబాబును ఉద్దేశించి ఉండవల్లి మాట్లాడారు.  

Similar News