TTD Specified Authority: 10 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.9 కోట్లు

TTD Specified Authority: తిరుమలను కాలుష్య రహితంగా మార్చాలని స్పెసిఫైడ్‌ అథారిటీ నిర్ణయించింది.

Update: 2021-08-06 14:18 GMT

TTD Specified Authority: 10 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.9 కోట్లు

TTD Specified Authority: తిరుమలను కాలుష్య రహితంగా మార్చాలని స్పెసిఫైడ్‌ అథారిటీ నిర్ణయించింది. ఇందుకోసం 35 ఎలక్ట్రికల్‌ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నట్లు అథారిటీ చైర్మన్‌ తెలిపారు. టీటీడీ పరిధిలోని 10 ఆలయాల పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం 9కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 2కోట్ల రూపాయలతో తిరుమలలో మరిన్ని సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి నైవేధ్యానికి ప్రకృతి సిద్ధమైన నెయ్యి వినియోగించుకున్నట్లు వివరించారు. నెయ్యిని సమకూర్చుకునేందుకు 25 గిర్‌ జాతి ఆవులను తీసుకువస్తున్నట్లు తెలియజేశారు.

Tags:    

Similar News