Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. దర్శనం టికెట్లు ఉన్న భక్తులకే ఆన్‌లైన్‌లో గదులు

Tirumala: ఏప్రిల్ నెలకు దర్శనం టికెట్లు పొందిన వారికే గదులు

Update: 2024-01-25 03:09 GMT

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. దర్శనం టికెట్లు ఉన్న భక్తులకే ఆన్‌లైన్‌లో గదులు 

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. శ్రీవారి ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఈ నెల 18 నుంచి 24 వరకు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులు 2 గంటల 45 నిమిషాల్లోనే కొనుగోలు చేశారు.

Tags:    

Similar News