TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ

శ్రీవారి బ్రహ్మత్సవాలు ఏకాంతంగా జరుపుతాం

Update: 2021-09-17 08:14 GMT

కరోనా కారణంగా ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు (ఫైల్ ఇమేజ్)

TTD: తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుపుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష‌్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అక్బోబర్ 7 నుంచి అదే నెల 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ రోజుకు 10 నుంచి 15 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News