ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2019-08-08 14:43 GMT

గిరిజనులకు వైద్యసేవలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో గిరిజన మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి పాడేరు ఏరియా ఆసుపత్రి భవనాల్లోనే కళాశాల నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి వైఎస్సార్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీగా నామకరణం చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనున్నారు.

Tags:    

Similar News