నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Update: 2019-04-06 01:50 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (శనివారం) రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలో పర్యటించి, పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా కందుకూరులో, 3.15 గంటలకు సంతనూతలపాడులో, సాయంత్రం 4.45 గంటలకు చీరాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6.15 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరులో, రాత్రి 8.30 గంటలకు చిలకలూరిపేటలో చంద్రబాబు రోడ్‌షోలో పాల్గొంటారని ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

Similar News