చంద్రబాబు నేటి ప్రచార షెడ్యూల్..

Update: 2019-04-05 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం సభలు నిర్వహించనున్నారు. నేడు (శుక్రవారం) ఆయన కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు కర్నూలు జిల్లా ఆలూరులో, 3.45 గంటలకు నందికొట్కూరులో చంద్రబాబు రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6.45 గంటలకు విశాఖ జిల్లా కంచర్లపాలెంలో, రాత్రి 7.30 గంటలకు దుర్గాలమ్మ గుడి దగ్గర, 9 గంటలకు మధురవాడలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు సమాచారం. 

Similar News