Visakhapatnam: విశాఖ జిల్లా బంగారుమెట్టలో విషాదం

పెద్దేరు నదిలో గల్లంతయి ముగ్గురు మృతి పెద్దేరు నదిని దాటుతుండగా ప్రమాదం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాల వెలికితీత

Update: 2021-07-11 14:03 GMT

నది (ఫైల్ ఫోటో)

Visakhapatnam: విశాఖ జిల్లా బంగారుమెట్ట గ్రామంలో విషాదం నెలకొంది. స్థానిక పెద్దేరు నదిని దాటుతూ ప్రమాదవశాత్తూ నదిలో పడి ముగ్గురు మృతి చెందారు. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట సమీపంలోని పెద్దేరు నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో దారకొండ, రాము, శ్రీనులు మృతి చెందగా గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఈ ముగ్గురి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News