ఏకగ్రీవాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ లేవు-నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

*స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పంచాయతీలకు నిధులు వస్తాయి-నిమ్మగడ్డ *పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు దురుద్దేశ పూర్వకంగా జరుగుతున్నాయని... *రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి-నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

Update: 2021-01-29 12:15 GMT

ఏకగ్రీవాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ లేవు-నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పంచాయతీలకు నిధులు.. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు రక్షణ చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర సిబ్బందిపై పూర్తి విశ్వాసం ఉందని భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ చేశారని నిమ్మగడ్డ వెల్లడించారు. పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు దురుద్దేశ పూర్వకంగా జరుగుతున్నాయని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఏకగ్రీవాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ లేవని పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వస్తున్నవేని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News