TDP ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య వాగ్వాదం

Update: 2020-01-22 05:44 GMT
టీడీపీ ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య వాగ్వాదం

సచివాలయం సమీపంలోని ఫైర్‌స్టేషన్‌ వద్ద TDP ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాసనమండలికి బయల్దేరిన TDP ఎమ్మెల్సీల వాహనాలను ఫైర్‌ స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వాహనంపై ఎమ్మెల్సీ స్టిక్కర్‌ లేకుండా ఎలా వస్తారని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు వాహనంలో ఉండగా స్టిక్కర్‌తో పనేంటని టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు. 

Tags:    

Similar News