విజయసాయిరెడ్డిని చూసి నేర్చుకోండి.. టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ బుద్దా సూచన

Update: 2019-08-20 04:11 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎప్పుడూ ఒంటికాలుమీద లేచే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. విజయసాయిరెడ్డిని చూసి నేర్చుకోవాలని టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకన్న ఈ వ్యాఖ్యలు చేశారు. 'పార్టీ అధికారంలోకి రాలేదని ఇతర పార్టీలలోకి వెళుతోన్న టీడీపీ నేతలు విజయసాయిరెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఎంతో ఉన్నత చదువులు చదివిన ఆయన జగన్ తో పాటు జైలులో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోయినా జగన్ వెంటే ఉండి పార్టీని ముందుకు నడిపించారు, ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్నారు. లీడర్లు అంటే అలా లాయల్టీగా ఉండాలి' అని పరోక్షంగా టీడీపీ నుండి బీజేపీలో చేరిన, చేరబోతోన్న నేతలనుద్దేశించి మాట్లాడారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లు బీజేపీలో చేరగా.. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ , లంకా దినకర్ తదితరులు సైతం ఆ పార్టీలో చేరారు. వారందరు పార్టీకి ద్రోహం చేసి అధికారాన్ని అనుభవించి వెళ్లిపోయారని విమర్శించారు బుద్దా వెంకన్న. 

Tags:    

Similar News