టీడీపీ నాయకులు, కార్యకర్తలు పట్ల అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల ప్రోద్భలంతోనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. టీడీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని, అధికారులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులపై దాడులు పెరిగాయన్నారు అచ్చెన్నాయుడు.