చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్

Update: 2019-08-16 08:18 GMT

అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ఇంటి మీదకు ఇద్దరు వ్యక్తులు డ్రోన్ లు వదిలారు. దాంతో టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. డ్రోన్ ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడే ధర్నాకు దిగారు. అయితే పోలీసులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు వినలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో పలువురిపై లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. కొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు చంద్రబాబు కూడా డీజీపీతో మాట్లాడారు. 

Tags:    

Similar News