ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీలో భిన్నస్వరం

Update: 2019-06-26 12:24 GMT

ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావేదిక కూల్చివేతను కొందరు నేతలు తప్పుపడుతుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంపై టీడీపీలో కొందరు నేతలు రాద్దాంతం చేస్తున్నారన్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తప్పు చేస్తే సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు తోట త్రిమూర్తులు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ప్రజావేదికతో పాటు కరకట్టపై వెలసిన అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


Full View

Tags:    

Similar News