ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేత బీజేపీలో చేరిపోయారు. టీడీపీకి చెందిన ముఖ్యనేత, సివిల్ సప్లై కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసిన సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం బీజేపీ జాతీయ నేత రామ్మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. అలాగే తిరుపతికి చెందిన డాక్టర్ కృష్ణ ప్రశాంతి కూడాబీజేపీలో చేరారు.