మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? : దేవినేని ఉమ

Update: 2020-09-29 07:12 GMT

మద్యం టెండర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.'మద్యం రవాణాలో అస్మదీయులకు కోట్లు కట్టబెట్టేలా టెండర్? గతంలో పెట్ కు 18 రూపాయలు. ఇప్పుడు 30 పైనే కోట్, మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? రాష్ట్రమంతా ఒక్కరికే ఎలా ఇస్తారు? అనామక బ్రాండ్లు, నాసిరకం మద్యం తోపాటు రవాణాలోనూ జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి' అని ఉమ డిమాండ్ చేశారు. ఈమేరకు ట్వీట్ చేసిన ఆయన ఒక పత్రికలో ఈ అంశం గురించి వచ్చిన వార్త క్లిప్పింగ్ ను ఉంచి పోస్ట్ చేశారు.


Tags:    

Similar News