Bonda Uma: విజయమ్మను దూరం చేయడానికే ప్లీనరీ సమావేశాలు

Bonda Uma: జగన్‌ అధికారంలోకి తీసుకురావడానికి తల్లి, చెల్లి ఎంతో కష్టపడ్డారు

Update: 2022-07-10 15:00 GMT

Bonda Uma: విజయమ్మను దూరం చేయడానికే ప్లీనరీ సమావేశాలు

Bonda Uma: వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీ జగన్ మోహన్ రెడ్డి తల్లిని పార్టీకి దూరం చేయడం కోసమేనని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. విజయమ్మను బలవంతంగా ప్లీనరీ సమావేశాలకు తీసుకొచ్చి రాజీనామా ప్రకటన చేసిన గంటకే పంపేశారని ఆయన విచారం వ్యక్తంచేశారు. జగన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఎంతో కష్టపడ్డారనే విషయాన్ని ప్రస్తావించారు. కష్టపడిన కన్నతల్లిని, తోబుట్టువును పార్టీకి దూరం చేయడం దారుణమన్నారు.

Tags:    

Similar News