ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా కార్వేటినగరానికి చెందిన జనార్దన్ రాజు ఈనెల 26న తలకోనలో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో శుక్రవారం రాత్రి జనార్దన్రాజును అరెస్ట్ చేశారు.
కాగా అతని అరెస్ట్కు నిరసనగా తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. నిందితుడు జనార్దన్రాజు కార్వేటినగరానికి ఎంపీపీగా పనిచేశారు. కాగా ఇటీవల టీడీపీకి చెందిన శేఖర్ చౌదరీని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.