టీడీపీ కాపు నేతలు కాసేపట్లో పార్టీ అధినేత చంద్రబాబుతో బేటీకానున్నారు. మొన్న కాకినాడలో సమావేశం నిర్వహించి టీడీపీలో ప్రకంపనలు రేపిన కాపు నేతలు మళ్లీ ఇవాళ సుమారు రెండు గంటలకుపైగా విజయవాడలో భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసంలో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశానికి తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బడేటి బుజ్జీ, మాదవ నాయుడు, చెంగల రాయుడు, పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. టీడీపీ కాపు నేతలు పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో బెజవాడలో మరోసారి భేటీ కావడం చర్చనీయాంశమైంది.