ఆంధ్ర తమిళనాడు సరిహద్దున గోడలు నిర్మాణం.. ఏపీ అధికారులు సీరియస్
ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుతున్న పాజిటివ్ కేసులు దడ పుట్టస్తోంది.
ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుతున్న పాజిటివ్ కేసులు దడ పుట్టస్తోంది. నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 1117కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం, అధికారుల్లో ఆందోళన పెరిగింది.
దేశంలో ఓవైపు లాక్డౌన్ కొనసాగుతుంటే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో రాకపోకలు నిలిపివేస్తూ గోడలు కట్టడం కలకలం రేపింది. ఏపీలోని చిత్తూరు తితు మార్గంలో శెట్టింతంగాళ్ దగ్గర.. బొమ్మసముద్రం దగ్గర నేషనల్ హైవేపై.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి గుడియాత్తానికి వెళ్లే దారిలో.. రోడ్డుకు అడ్డంగా తమిళనాడు అధికారులు సిమెంటు గోడలు కట్టించారు. ఇలా మూడు చోట్ల రోడ్లపై గోడలు కట్టడం విమర్శలకు గురిచేస్తుంది.
చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసులు ఉండటంతో తమిళనాడు అధికారులు ఇలా గోడలు కట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమిళనాడులో ఏపీ కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారుల్లో ఇలా గోడలు నిర్మించడంపై స్థానికులు మండిపడుతున్నారు. చిత్తూరు అధికారులు సీరియస్గా తీసుకున్నారు. పలమనేరు ఎమ్మార్వో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమిళనాడు అధికారులతో ఏపీ అధికారులు చర్చించనున్నారు.