ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులపై బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం మరో సీఐని బదిలీ చేసింది ఎన్నికల సంఘం. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో శరత్ చంద్రను సీఐగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న కారణంతో చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో పట్టణ సీఐ సురేశ్కుమార్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సీఐగా పనిచేస్తున్న పి. సుబ్బారాయుడును నియమిస్తూ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు.