రెండు గంటల్లోనే బోటును బయటకు తీస్తా..వారం క్రితమే మునిగిన బోటు అద్దం పగులగొట్టా
10 రోజులు ముగిశాయి కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అయితే అవకాశం ఇస్తే తాను రెండంటే రెండు గంటల్లోనే బోటును ఒడ్డుకు చేరుస్తానని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంటక శివ ఛాలెంజ్ చేస్తున్నారు. 4 లంగర్లు వేసి ఐరన్ తాడుతో లాగుతాం అని 9 మంది మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ చేస్తామంటున్నారు. బోటును ఎలా బయటకు తీసుకురావాలో మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు. బోటును వెలికి తీసే క్రమంలో తన ప్రాణానికి ఎలాంటి హాని జరగదన్నారు శివ.