పెట్రోల్ బంకులో ఎస్సై వీరంగం.. డీజిల్ పోయలేదని..

Update: 2019-06-09 11:22 GMT

అధికార దర్పంతో ఓ ఎస్సై పెట్రోల్ బంక్ కార్మికుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఎస్సై రాంబాబు తన వాహనాన్ని డ్రైవరుకిచ్చి డీజిల్‌ పోయించుకురమ్మని స్థానిక ఓంనమశివాయ పెట్రోలు బంకుకు పంపారు. తన యజమాని చెబితేనే డీజిల్ పోస్తానని కార్మికుడు హుమాయున్ చెప్పాడు. డ్రైవర్ వెంటనే ఈ విషయాన్ని ఎస్సైకి ఫోన్ చేసి చెప్పాడు. ఆగ్రహించిన ఎస్సై వాహనాన్ని వెనక్కి పిలిపించి అదే వాహనంలో బంకుకు వచ్చి కార్మికుడిని కొట్టారు. అనంతరం స్టేషన్‌కి తీసుకెళ్లి కూడా కొట్టారని.. అదేమని అడిగితే అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనను నిరసిస్తూ ఎస్సైకు వ్యతిరేకంగా బంకు కార్మికులు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఈ ఘటనపై ఎస్సై రాంబాబు స్పందిస్తూ.. తాము నెలనెలా బిల్లు చెల్లిస్తామని, డీజిల్‌ కోసం వాహనం పంపితే కార్మికుడు డ్రైవరుతో దురుసుగా మాట్లాడాడని తెలిపారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

Tags:    

Similar News