శ్రీశైలంలో మరో వివాదం.. మొత్తం 14 మంది..

Update: 2019-08-26 05:43 GMT

శ్రీశైలంలో మరో వివాదం నెలకొంది. శ్రీశైలం దేవస్థానంలో మొత్తం 14 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ముగ్గురు శాశ్వత ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అన్యమత ఉద్యోగుల జాబితాను తయారు చేశారు అధికారులు. త్వరలో ఈ జాబితాను ఏపీ ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదిక అందగానే దీనిపై కమిటీని నియమించే అవకాశం ఉందని సమాచారం. కమిటీ విచారణలో వీరు అన్యమత ప్రచారం చేస్తున్నట్టు రుజువైతే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News