ఆంధ్రప్రదేశ్ లో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటి టిడిపి మరియు వైసీపీ మధ్యనే జరిగింది అన్నది ఎవరు కాదనలేని వాస్తవం .. ఇందులో జనసేన కొంచం కూడా ప్రభావం చూపించలేకపోయింది . కానీ టిడిపి ఓటమికి జనసేన కూడా ఓ ప్రధానమైన కారణమే .. ఓట్లు చీలికతో టిడిపి అభ్యర్దులు ఓటమి పాలయ్యారు .. అందులో భాగంగా విశాఖ నుండి తొలిసారి ఎంపీ బరిలో దిగిన బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కూడా ఓటమి చవిచూసారు. అయితే తన ఓటమికి గల కారణాలను బయటపెట్టారు శ్రీ భరత్ ..
గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి హాజరైన శ్రీభరత్... తన ఓటమికి కారణం ఏంటనే విషయాన్ని మీడియాకు వివరించారు. త్రిముఖ పోరు, క్రాస్ ఓటింగే తన ఓటమికి కారణమని భరత్ అన్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఆ స్థాయిలో ఓట్లను చీలుస్తారని ఊహించలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా మరియు ఎమెల్యేగా పోటికి దిగిన బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు ఓడిపోయారు .. కానీ అయన మాత్రం హిందూపురంలో ఘన విజయం సాధించారు ..