Road Accident: ఒంగోల్లో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఆటోను ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

Update: 2020-03-21 02:53 GMT
road accident in Prakasam district

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఆటోను ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటన ఒంగోలు మండలం బకింగ్ హం కెనాల్ వద్ద జరిగింది. ఈత ముక్కల గ్రామం నుంచి వస్తున్న కారు.. బకింగ్ హం కెనాల్ వద్దకు రాగానే ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రి కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు మడనూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ మేడికొండ బ్రహ్మయ్య (35), సాదు ప్రియాంక (27) , బిల్లా శ్రీలత (32) సంఘటనా స్థలిలోనే మరణించారు. పల్లెపాలెంకు చెందిన రసాని గోవిందమ్మ(35), రాజుపాలెం గ్రామానికి ఆత్మకూరి శ్రీను, దార్ల సుబ్బులు (50) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రమాదంలో ఆటో మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. అలాగే రోడ్డుకు అడ్డంగా ఉన్న దెబ్బతిన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తీసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News