టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత కొంత కాలంగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే ఇవాళ శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు శివప్రసాద్ ను పరామర్శించేందుకు కాసేపట్లో చెన్నై వెళ్లనున్నారు.